తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్​ చేయాలి' - పీడీఎస్​యూ నిరసనలు

నిజామాబాద్​లోని ఓ ప్రైవేట్​ స్కూల్​ కరస్పాండెంట్​పై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్​ చేయాలని పీడీఎస్​యూ డిమాండ్​ చేసింది. ఈ మేరకు​ డీఈవోకు విద్యార్థి సంఘం నేతలు వినతి పత్రం అందజేశారు.

pdsu demands for suspension of govt school head master in nizamabad
లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్​ చేయాలి

By

Published : Nov 6, 2020, 10:50 AM IST

ప్రైవేట్​ పాఠశాల కరస్పాండెంట్​పై లైంగిక వేధింపులకు పాల్పడిన నిజామాబాద్​లోని బర్కత్​పుర ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్ చేయాలని పీడీఎస్​యూ డిమాండ్​ చేసింది. ఈ మేరకు డీఈవో కార్యాలయం ఎదుట పీడీఎస్​యూ విద్యార్థి సంఘం నేతలు నిరసన తెలిపారు. డీఈవోకు వినతి పత్రం అందజేశారు.

నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి బదిలీ లేకుండా 23 ఏళ్లుగా ఒకే పాఠశాలలో కొనసాగుతున్న ప్రధానోపాధ్యాయుడిపై అనేక ఆరోపణలు ఉన్నాయని పీడీఎస్​యూ పేర్కొంది. విద్యార్హతలు, కుల ధ్రువీకరణ పత్రాలపైనా అనేక సందేహాలు ఉన్నాయని వ్యక్తం చేసింది. అతడిని సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:నాటు సారా స్వాధీనం.. గంజాయి మొక్కలు ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details