బహుళ అంతస్థుల భవనాలు... చుట్టూ అహ్లాదకరమైన పార్కు, స్విమ్మింగ్ పూల్, జనరేటర్ సౌకర్యం అంటూ రియల్టర్లు ప్రజలను నమ్మించి కొనిపిస్తారు. తీరా రిజిస్ట్రేషన్ అయ్యాక చూస్తే అన్నింటా నాణ్యత లోపం... మూడు నాలుగు నెలల క్రితం హైదరాబాద్లోని ఓ అపార్టుమెంట్ పార్కులో ఆడుకుంటున్న బాలుడు పక్కనే ఉన్న విద్యుత్ తీగ తగిలి ప్రాణాలొదిలాడు. నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అత్తాపూర్లోని జనప్రియ అపార్టుమెంట్లో నాణ్యతలేని సిమెంట్ బల్ల మీద పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. సకల సౌకర్యాల పేరుతో ఫ్లాట్లను కొనిపించి ప్రజలను మోసం చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియట్లేదని ఆవేదన చెందుతున్నారు. ఆరేళ్ల బాలుడి మృతికి నిర్వాహణ లోపమే కారణమని అపార్ట్మెంట్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అపార్ట్మెంట్లలో ఏం జరుగుతోంది...? - hyd
అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనేప్పుడు సకల సౌకర్యాలంటూ మాట్లాడే రియల్టర్లు... నిర్మాణం విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారంటున్నారు. హైదరాబాద్లోని అత్తాపూర్ జనప్రియ అపార్ట్మెంట్లో గత సాయంత్రం సిమెంట్ బల్ల మీదపడి ప్రాణాలు గాల్లో కలిసాయి. నాణ్యత లోపం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయంటున్నారు అపార్ట్మెంట్ వాసులు. సరైన నిర్వహణ లేక పిల్లలు మృత్యువాత పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు.
![అపార్ట్మెంట్లలో ఏం జరుగుతోంది...?](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3110247-thumbnail-3x2-boy.jpg)
అపార్ట్మెంట్లలో ఏం జరుగుతోంది...?