తెలంగాణ

telangana

By

Published : Feb 7, 2019, 6:50 PM IST

ETV Bharat / jagte-raho

శిఖా కంపెనీ డబ్బులు సొంతానికి వాడేది : పద్మశ్రీ

వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో శిఖా చౌదరికి క్లీన్​ చిట్​ ఇవ్వడంపై... భార్య పద్మ శ్రీ అనుమానాలు వ్యక్తం చేశారు. రాకేశ్​ రెడ్డి వద్ద తీసుకున్న డబ్బు ఏమైందో తనకు తెలియదన్నారు. తన భర్త చనిపోయిన తర్వాత శిఖా తమ ఇంటికి ఎందుకొచ్చిందో పోలీసులు విచారించాలని కోరారు. జయరాం భర్తగా, తండ్రిగా గొప్ప పాత్ర పోషించారని పద్మ శ్రీ గుర్తు చేసుకున్నారు.

జయరాం భార్య

మేనకోడలని శిఖా చౌదరికి ప్రధాన బాధ్యతలు అప్పగించారని పద్మ శ్రీ తెలిపారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బును సొంతానికి వాడుకుందని అన్నారు. జయరాం భర్తగా, తండ్రిగా , ఉద్యోగిగా గొప్ప పాత్ర వహించారని గుర్తు చేసుకున్నారు. జయరాం తమ మధ్య లేకపోవడం జీర్ణించుకోలేక పోతున్నానని అన్నారు.

శిఖా కంపెనీ డబ్బులు సొంతానికి వాడేది

ABOUT THE AUTHOR

...view details