బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా పెద్ద పడిశాల సమీపంలో చోటుచేసుకుంది. ఆత్మకూరు(ఎం) మండలం ఖప్రాయపల్లికి చెందిన కొంగరి రాములు(35) వస్తా కొండూరులోని బంధువుల ఇంటికి వచ్చి వెళ్తున్నాడు.
ద్విచక్రవాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి
ఓ వాహనదారుడు ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఘటనలో ఆ వ్యక్తి తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లాలో జరిగింది.
![ద్విచక్రవాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి Out of control bike One person died on the spot at yadadri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10103682-201-10103682-1609669316017.jpg)
అదుపు తప్పిన బైక్.. అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి
ఈ క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడి తలకు బలమైన గాయం తగిలింది. దీంతో అక్కడికక్కడే ఆ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.
ఇదీ చూడండి :గురువు మందలించారని విద్యార్థి ఆత్మహత్య