గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం, కేసానుపల్లిలో దారుణహత్య జరిగింది. మందసాయివేణు అనే యువకుడు తన స్నేహితుడు బలుసుపాటి వీరాంజనేయులును కత్తితో పొడిచి హతమార్చాడు. లలీతాదేవి కాలనీకి చెందిన వీరాంజనేయులు , సాయివేణులు ఇద్దరు స్నేహితులు. బుధవారం రాత్రి వీరిరువురు మద్యం సేవిస్తుండగా ఘర్షణ తలెత్తింది.
మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ.. ఒకరి హత్య - latest news guntur district
ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కేసానుపల్లిలో జరిగింది. . బుధవారం రాత్రి వీరిరువురు మద్యం సేవిస్తుండగా తలెత్తిన ఘర్షణే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో స్నేహితుల మధ్య వివాదం; ఒకరి హత్య
గొడవలో వీరాంజనేయులును, సాయివేణు కత్తితో పొడిచి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. హతుడ్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు నరసరావుపేట గ్రామీణ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.