యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో విద్యుతాఘాతంతో సురేశ్ అనే భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఓ భవన నిర్మాణంలో పని చేస్తుండగాా ప్రమాదవశాత్తు కరెంట్షాక్కు గురై సురేశ్ అక్కడికక్కడే మరణించాడు.
విద్యుదాఘాతంతో భవననిర్మాణ కార్మికుడు మృతి - యాదాద్రి భువనగిరిజిల్లా నేర వార్తలు
విద్యుతాఘాతానికి గురై ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఈఘటన యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ప్రమాదంపై కేసు నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
![విద్యుదాఘాతంతో భవననిర్మాణ కార్మికుడు మృతి one person dead with electric shock at vangapally village in yadadri bhuvanagiri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9048351-87-9048351-1601820092912.jpg)
విద్యుదాఘాతంతో భవననిర్మాణ కార్మికుడు మృతి
మృతుడికి సంవత్సరం క్రితమే వివాహం అయ్యిందని తోటి పనివారు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసునమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.
ఇదీ చూడండి:నెల రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిన ప్రేమ బాధితురాలు