తెలంగాణ

telangana

విద్యుదాఘాతంతో భవననిర్మాణ కార్మికుడు మృతి

విద్యుతాఘాతానికి గురై ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఈఘటన యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ప్రమాదంపై కేసు నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

By

Published : Oct 4, 2020, 7:42 PM IST

Published : Oct 4, 2020, 7:42 PM IST

one person dead with electric shock at vangapally village in yadadri bhuvanagiri district
విద్యుదాఘాతంతో భవననిర్మాణ కార్మికుడు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో విద్యుతాఘాతంతో సురేశ్​ అనే భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఓ భవన నిర్మాణంలో పని చేస్తుండగాా ప్రమాదవశాత్తు కరెంట్​షాక్​కు గురై సురేశ్​ అక్కడికక్కడే మరణించాడు.

మృతుడికి సంవత్సరం క్రితమే వివాహం అయ్యిందని తోటి పనివారు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసునమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

ఇదీ చూడండి:నెల రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిన ప్రేమ బాధితురాలు

ABOUT THE AUTHOR

...view details