తెలంగాణ

telangana

By

Published : Nov 25, 2020, 5:51 PM IST

ETV Bharat / jagte-raho

మద్దిరాలలో గంజాయి సేవిస్తున్న యువకుడిపై కేసు నమోదు

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కేంద్రంలో నిషేధిత గంజాయి సేవిస్తున్న యువకున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 25 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

one person arrested in to taking drugs in suryapeta dist
మద్దిరాలలో గంజాయి సేవిస్తున్న యువకుడిపై కేసు నమోదు

నిషేధిత గంజాయి సేవిస్తున్న యువకున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్ర శివారులో బండి శ్రీకాంత్​ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 25 గ్రాముల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అతనిపై మాదకద్రవ్యాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నాగారం సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలను విక్రయించినా, తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని మద్దిరాల ఎస్సై సాయిప్రశాంత్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్​ సిబ్బంది రాములు, హేమంత్, సతీశ్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కల నెరవేరలేదని తనువు చాలించాడు...

ABOUT THE AUTHOR

...view details