జోగులాంబ గద్వాల్ జిల్లా కోస్గికి చెందిన భూపాల్, కంచిరావుపల్లికి చెందిన లింగేశ్ ఇద్దరు హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఐజ మండలం పులికల్లో బంధువు అంత్యక్రియలు ముగించుకుని తిరిగి హైదరాబాద్కు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఇటిక్యాల మండలం యాక్తపూర్ దగ్గర జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం వీరి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో భూపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన లింగేశ్ను కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఐజ ఎస్సై తెలిపారు.
అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం... వ్యక్తి మృతి - యక్తపూర్ రోడ్డు ప్రమాదం
అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... మరొకరు తీవ్ర గాయాల పాలయ్యాయి. ఈ ఘటన గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం యక్తపూర్ దగ్గర జాతీయ రహదారిపై జరిగింది.
అంత్యక్రియలకని వెళ్లి... అనంతలోకాలకు వెళ్లాడు