తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే.. చంపేశారు'

సికింద్రాబాద్​ ఓల్డ్​ అల్వాల్​లోని ఎక్సెల్​ ఆసుపత్రిలో కడుపు నొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్న మూడ్రోజుల అనంతరం ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించాడని ఆసుపత్రి ఎదుట మృతుని బంధువులు ఆందోళనకు దిగారు.

By

Published : Jun 14, 2020, 11:25 AM IST

one dead at excel hospital due to doctors negligence in Hyderabad
ఎక్సెల్​ ఆసుపత్రి వద్ద ఆందోళన

హైదరాబాద్​ బొల్లారంలో నివాసముంటున్న అరుణ్ కుమార్ అనే వ్యక్తి కడుపు నొప్పితో జూన్ 6న సికింద్రాబాద్​ ఓల్డ్ అల్వాల్​లోని ఎక్సెల్ ఆసుపత్రిలో చేరాడు. అతణ్ని పరీక్షించిన అనంతరం కడుపులో చిన్న గడ్డ ఏర్పడిందని వైద్యులు నిర్ధారించారు. సర్జరీ చేసి కడుపులోని గడ్డను తొలగించారు. ఆరోగ్యం కుదుటపడ్డాక ఈనెల 11న అరుణ్​ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

రెండ్రోజుల క్రితం అరుణ్​ కడుపులో నుంచి రక్తస్రావం కావడం వల్ల ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మళ్లీ వైద్యులను సంప్రదించారు. హిమాయత్​ననగర్​లోని బ్రాంచ్​ ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించగా.. అక్కడికి వెళ్లారు. హిమాయత్​నగర్​ ఎక్సెల్​ ఆసుపత్రి వైద్యులు అరుణ్​ను మరోసారి పరీక్షించి, కడుపులో నీరు చేరిందని, మరో సర్జరీ చేశారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి కోమాలోకి వెళ్లిన అరుణ్.. ఈనెల 13న మృతి చెందాడు.

ఓల్డ్ అల్వాల్​లోని ఎక్సెల్​ ఆసుపత్రి వైద్యులు చేసిన శస్త్ర చికిత్స విఫలం చెందడం వల్లే అరుణ్ మరణించాడని, అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యులపై అల్వాల్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details