తెలంగాణ

telangana

By

Published : Sep 22, 2020, 6:44 PM IST

ETV Bharat / jagte-raho

రూ.40 లక్షలు ఎక్కడ దాచారనే విషయంపై అనిశా ఆరా

నర్సాపూర్‌ లంచం కేసులో రెండోరోజూ నిందితులను అవినీతి నిరోధక శాఖాధికారులు ప్రశ్నిస్తున్నారు. అదనపు కలెక్టర్ నగేష్​​తో పాటు ఆయన బినామీ జీవన్ గౌడ్​ను అధికారులు వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. లంచంగా తీసుకున్న సొమ్ములో రూ.40 లక్షలు ఎక్కడ దాచారనే విషయంపైనా లోతుగా అధికారులు ఆరా తీస్తున్నారు.

narsapur addl collector
narsapur addl collector

నర్సాపూర్‌ లంచం కేసులో అదనపు కలెక్టర్ నగేష్​ను అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారిస్తున్నారు. నగేష్​తో పాటు ఆయన బినామీ జీవన్ గౌడ్​ను అధికారులు వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా అదనపు కలెక్టర్ నగేష్​తో పాటు ఆర్డీవో అరుణ రెడ్డి, తహసీల్దార్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీమ్, జీవన్ గౌడ్​ను అనిశా అధికారులు రెండోరోజు ప్రశ్నిస్తున్నారు.

రూ.40 లక్షలు ఎక్కడ..?

బాధితుడు లింగమూర్తి నుంచి తీసుకున్న రూ.40 లక్షలను ఎక్కడ ఉంచారని అవినీతి నిరోధక శాఖ అధికారులు నగేష్​ను ప్రశ్నించారు. దీనికి ఆయన పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. నగేష్ తన బినామీ జీవన్ గౌడ్​తో ఎక్కడెక్కడ వ్యవహారాలు నడిపాడని అధికారులు ఆరా తీస్తున్నారు. కొంపల్లిలోని నగేష్ ఇంట్లో దొరికిన లాకర్​ బోయిన్​పల్లి ఆంధ్ర బ్యాంకులో ఉన్నట్లు గుర్తించి దానికి సంబంధించిన వివరాలను ప్రశ్నించారు.

లేఖపై ప్రశ్నలు

నగేష్ సహాయంతో ఇంకా ఎన్ని భూములకు ఎన్వోసీలు ఇచ్చారనే కోణంలో ఆర్డీవో అరుణ రెడ్డి, తహసీల్దార్ సత్తార్​ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిషేధిత జాబితా కింద ఉన్న ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా అప్పటి కలెక్టర్ ధర్మారెడ్డి లేఖ రాయడంతో దానికి సంబంధించిన వివరాలను నగేష్ నుంచి సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి :రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ బకాయిలు వెంటనే ఇవ్వాలి: హరీశ్‌

ABOUT THE AUTHOR

...view details