తెలంగాణ

telangana

By

Published : Apr 28, 2020, 5:28 PM IST

ETV Bharat / jagte-raho

మద్యం దుకాణం వద్ద కాపలాదారుడి దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి దుద్దుకూరులో దారుణం జరిగింది. స్థానిక మద్యం దుకాణం వద్ద కాపాలాదురుడిగా పనిచేస్తున్న వ్యక్తిని.. గుర్తు తెలియని దుండగులు పెట్రోల్​ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

murder-in-west-godavari-district
మద్యం దుకాణం వద్ద కాపలాదారుడి దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిలా దేవరపల్లి మండలంలోని మల్లిపూడికి చెందిన వెంకటే్శ్​.. దుద్దుకూరులోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద వాచ్​మెన్​గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి మద్యం దుకాణం వద్ద నిద్రిస్తున్న వెంకటేశ్​​పై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి హత్యచేశారు. వ్యక్తిగత కక్షలతో ఈ ఘటనకు పాల్పడ్డారా? లేదా మద్యం దొంగలించేందుకు వచ్చి హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details