తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2020, 3:21 PM IST

ETV Bharat / jagte-raho

మార్కెట్‌యార్డు ఛైర్మన్ కుమారుడిపై హత్యాయత్నం

ఏపీలోని మచిలీపట్నం మార్కెట్‌యార్డు ఛైర్మన్‌, వైకాపా నేత అచ్చాబా కుమారుడు ఖాదర్‌ బాషాపై హత్యాయత్నం జరిగింది. ఒంటిపై కిరోసిన్‌ పోసి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఖాదర్‌ బాషాకు 40శాతానికి పైగా గాయాలయ్యాయి.

Murder attempt
వైకాపా నేత కుమారుడిపై హత్యాయత్నం

ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. మార్కెట్‌యార్డు ఛైర్మన్‌, వైకాపా నేత అచ్చాబా కుమారుడు ఖాదర్‌ బాషాపై హత్యాయత్నం జరిగింది. ఖాదర్‌ బాషా ఇంట్లో ఉన్న సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఖాదర్‌ బాషాకు 40శాతానికి పైగా గాయాలయ్యాయి.

ప్రత్యర్థులు ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా లేక కుటుంబ కలహాల నేపథ్యంలో ఘటన జరిగిందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడిని చికిత్స కోసం పోలీసులు విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఖాదర్‌బాషా భార్యపై అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:ఇద్దరు పిల్లలతో వివాహిత అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details