తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మైనర్​తో వృద్ధుడి వివాహం కేసులో ఆరుగురు అరెస్ట్​ - ఫలక్‌నుమా పోలీసుల తాజా వార్తలు

బాలికకు వృద్ధుడితో వివాహం జరిపించిన కేసులో.. బాలిక బంధువులు, దళారీలు సహా మొత్తం ఆరుగురు నిందితులని ఫలక్‌నుమా పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అబ్దుల్‌ లతీఫ్‌ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Minor Marriage Accused persons Arrest by Falaknuma
మైనర్​తో వృద్ధుడి వివాహం కేసులో ఆరుగురు అరెస్ట్​

By

Published : Dec 31, 2020, 5:46 PM IST

బాలికకు వృద్ధుడితో వివాహం జరిపించిన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అబ్దుల్‌ లతీఫ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అత్యాచారం, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న ఫలక్‌నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తీగలకుంటకు చెందిన 16 సంవత్సరాల మైనర్​కు కేరళకు చెందిన 58 సంవత్సరాల వృద్ధుడు అబ్దుల్‌ లతీఫ్‌ పరాంబన్‌తో ఈ నెల 27న వివాహం జరిగింది. బాలిక పిన్ని హూర్‌ ఉన్నీసా, ఆమె బంధువులు మీర్‌ రహ్మతుల్లా, అబ్దుల్‌ రహ్మాన్‌తో పాటు దళారీలు వసీం ఖాన్‌, ఖాజీ, బదీయుద్దీన్‌ ఖాద్రీ కలిసి ఈ నెల 27న పెళ్లి జరిపించారు. బాలికను వివాహం చేసుకున్న అబ్దుల్‌ లతీఫ్‌ ఆమెపై లైంగిక దాడి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బాలిక సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: న్యూ ఇయర్​ వేడుకలకు డ్రగ్స్.. పోలీసుల చెక్!

ABOUT THE AUTHOR

...view details