తెలంగాణ

telangana

వివాహిత అదృశ్యం.. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఇంటికి సమీపంలోని తన పుట్టింటికి వెళ్తున్నట్లు చెప్పిన జమా రాఖీ అనే వివాహిత అదృశ్యమైన సంఘటన సికింద్రాబాద్​లోని తుకారాంగేట్​ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. ఆమె కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Oct 17, 2020, 9:59 PM IST

Published : Oct 17, 2020, 9:59 PM IST

married woman missing at tukaramgate
వివాహిత అదృశ్యం.. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలోని తుకారాంగేట్​కు చెందిన మహిళ శనివారం ఇంటికి సమీపంలో ఉండే తల్లి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పిన ఆమె అదృశ్యమైంది. అనంతరం బయటి నుంచి ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులకు ఆమె ఆచూకీ ఎక్కడా దొరకలేదు. డూప్లికేట్​ తాళంతో తలుపులు తీసి చూడగా.. మంచంపై ఒక ఉత్తరం కనిపించింది.

ఆ ఉత్తరంలో.. తనకు ఇక్కడ ఉండలేనని.. తన జీవితం.. తాను చూసుకుంటున్నానని.. ఎక్కడా వెతకొద్దని రాసి ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఫోన్​ చేస్తే స్విచ్ఛాఫ్​ వస్తుందని.. బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద ఎక్కడ వెతికినా జాడ లేదని తెలిపారు. కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: వరదలతో పాటే వ్యాధులు... పొంచి ఉన్న డయేరియా, మలేరియా, డెంగీ.

ABOUT THE AUTHOR

...view details