తెలంగాణ

telangana

By

Published : Oct 16, 2020, 8:58 PM IST

ETV Bharat / jagte-raho

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందిన ఘటనలో తెలంగాణ- ఛత్తీస్ గఢ్ అటవీ సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంది. ఘటనాస్థలిలో తుపాకీ, మందుపాతర తయారీకి వాడే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

తెలంగాణ - ఛత్తీస్ గఢ్ అటవీ సరిహద్దు ప్రాంతంలోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో రూ. లక్ష రివార్డు ఉన్న ఓ మావోయిస్టు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అవుటపల్లి ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనాస్థలిలో తుపాకీ, మందుపాతర తయారీకి వాడే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టును వికేశ్ హేమ్లాగా పోలీసులు గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులకు గాయాలపాలై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉగ్రరూపం.. జూరాల ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తివేత

ABOUT THE AUTHOR

...view details