తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బాలానగర్​లో యజమాని వద్ద నగదు దొంగలించిన వ్యక్తి అరెస్ట్​ - man who theft from owner in balanagar police station limits

యజమాని దృష్టి మరల్చి నగదు దొంగిలించిన కేసులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్​ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్​ చేశారు. నిందితుడి నుంచి రూ. 50 వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు.

man who theft from owner in balanagar police station limits
బాలానగర్​లో యజమాని వద్ద నగదు దొంగలించిన వ్యక్తి అరెస్ట్​

By

Published : Aug 20, 2020, 9:27 PM IST

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్​ పోలీస్​స్టేషన్​ పరిధి రాజు కాలనీలో ఉన్న పాల వ్యాపారి యజమాని తన నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న మధ్యాహ్నం తాను పాల ప్యాకెట్లను లెక్కించేటప్పుడు.. అతడిని మాటల్లో పెట్ట అదే టేబుల్​పై ఉన్న రూ. 58, 000 నగదును ప్రవీణ్​ అనే వ్యక్తి దొంగిలించాడు. ఈ విషయాన్ని యజమాని గుర్తించగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా నిందితుడు ప్రవీణ్​ను గురువారం పట్టుకుని అరెస్ట్​ చేశారు. అతని వద్ద నుంచి రూ. 50 వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:కేంద్ర జల్​ శక్తి మంత్రికి కరోనా పాజిటివ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details