తెలంగాణ

telangana

వివాహిత కోసం... స్నేహితుడినే చంపాలనుకున్నాడు

By

Published : Oct 9, 2020, 5:32 PM IST

తాను సన్నిహితంగా ఉన్న వివాహితతో సంబంధం పెట్టుకున్నాడని స్నేహితుడికి... ఓ వ్యక్తి శీతల పానీయంలో పురుగుల మందు కలిపి ఇచ్చాడు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలోని యడ్లపాడులో చోటు చేసుకుంది.

man-tried-to-kill-friend-due-to-suspicion-on-his-loved one-at-guntur
స్నేహితుడిపై అనుమానం.. కూల్​డ్రింక్​లో గడ్డిమందు కలిపి హత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా యడ్లపాడులో ఓ వ్యక్తి తనకు సంబంధం ఉన్న వివాహితతో సన్నిహతంగా ఉంటున్నాడని.. మిత్రుడికి పురుగుల మందు ఇచ్చి హత్య చేయడానికి ప్రయత్నించాడు. దాట్ల గోపి వర్మ, అదే మండలం మర్రిపాలెంకు చెందిన కొమ్మూరి ప్రేమ్ చంద్​లు మంచి స్నేహితులు. ప్రేమ్ చంద్​కు కాకుమాను మండలం గరికపాడు గ్రామానికి చెందిన దూరపు బంధువైన ఓ వివాహితతో సన్నిహిత సంబంధం ఉంది. ఇటీవల ప్రేమ్ చంద్​కు కాకుమాను మండలం గరికపూడి గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రేమ్​చంద్ సన్నిహితంగా ఉన్న వివాహితతో గోపివర్మ పరిచయం పెంచుకొని తరచుగా ఫోన్లో మాట్లాడుతుండేవాడు. ఇది గుర్తించిన ప్రేమ్ చంద్.. మిత్రుడు గోపీచంద్​పై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది.

ఈ నెల 2వ తేదీన యడ్లపాడు వచ్చిన ప్రేమ్ చంద్ స్నేహితుడు గోపి వర్మను కలిశాడు. మరొకసారి ఇద్దరి మధ్య అదే విషయంలో గొడవ జరిగింది. గోపివర్మను కడతేర్చాలని ప్రేమ్​చంద్ నిర్ణయించుకున్నాడు. అదేరోజు రాత్రి గోపివర్మను కలిసి పురుగుల మందు కలిపిన శీతల పానీయాన్ని అతనితో తాగించాడు. అనంతరం ఇద్దరూ వెళ్లిపోయారు. అనంతరం గోపివర్మ పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం గోపివర్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. యడ్లపాడు ఎస్సై శ్రీహరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:'నా భర్త నన్ను మోసం చేశాడు.. న్యాయం చేయండి'

ABOUT THE AUTHOR

...view details