తెలంగాణ

telangana

By

Published : Aug 24, 2020, 11:36 AM IST

ETV Bharat / jagte-raho

కాగజ్​నగర్​లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కుమురం భీం జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... హత్యనా.. ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

man suspicious  death in kumuram bheem district
కాగజ్​నగర్​లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని ఈఎస్​ఐ కాలనీ సమీపంలోని పాడుబడ్డ క్వార్టర్స్​లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం ఉందని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

మృతుడు పట్టణానికి చెందిన సాబీర్​(30)గా గుర్తించారు. పట్టణ ఎస్​హెచ్​ఓ మోహన్​ ఘటనస్థలిని పరిశీలించి మృతుడి కుటుంబీకుల వద్ద వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి ఫరీదుద్దీన్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్యనా.. ఆత్మహత్యనా లేక ప్రమాదవశాత్తు మృతి చెందాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య, పాప ఉన్నారు.

ఇదీ చూడండి:వ్యాక్సిన్​ ట్రయల్స్ ఆలస్యంపై ట్రంప్ మండిపాటు

ABOUT THE AUTHOR

...view details