రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శనివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని మహాలక్ష్మి వీధికి చెందిన రాజు, శ్రీనివాస్ గౌడ్లకు పాతకక్షలున్నాయి. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రీనివాస్ గౌడ్ను రాజు అనే వ్యక్తి గొడ్డలితో విచక్షణరహితంగా నరికాడు.
వేములవాడలో వ్యక్తి దారుణ హత్య.. పాతకక్షలే కారణం - సిరిసిల్ల వార్తలు
పాతకక్షలు మనసులో పెట్టుకొని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలో చనిపోయాడు.

వేములవాడలో వ్యక్తి దారుణ హత్య.. పాతకక్షలే కారణం
తీవ్ర గాయాలతో.. రక్తపుమడుగులో పడి ఉన్న శ్రీనివాస్ గౌడ్ను స్థానికులు హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా బాధితుడు మృతి చెందాడు. పట్టణ సీఐ వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం వేములవాడ డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం.
ఇదీ చూడండి:రాష్ట్ర కేడర్కు కేటాయించిన ఐఏఎస్లకు పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం