తెలంగాణ

telangana

By

Published : Dec 15, 2020, 9:24 PM IST

ETV Bharat / jagte-raho

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి... కుటుంబానికి అతనే ఆధారం

అతను కూలిపనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోగా... కుటుంబ పెద్దగా ఉంటూ పోషిస్తున్నాడు. అతని పట్ల విధి చిన్నచూపు చూసింది. పొలానికి నీళ్లు పెట్టేందుకు మోటార్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై తనువు చాలించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

man-dies-with-electric-shock-in-suryapeta-district
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి... కుటుంబానికి అతనే ఆధారం

సూర్యాపేట జిల్లా హూజుర్​నగర్​ మండలం వేపలసింగారంలో విషాదం జరిగింది. పొలానికి నీళ్లు పెట్టేందుకు మోటార్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై తోకల సైదులు(30) మృత్యువాత పడ్డాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

భార్యభర్తలిద్దరూ కూలి పనులకు జీవనం సాగించేవారు. అతని తండ్రి చిన్నతనంలోనే చనిపోగా...కుటుంబాన్ని పోషించేవారు లేకుండా పోయారు. ఇద్దరు చిన్నపిల్లలు కాగా...ఎలా బ్రతకాలంటూ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదీ చూడండి:ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్రపై విచారణ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details