తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విద్యుత్​ షాక్​తో కార్మికుడు మృతి.. కేసు నమోదు - సంగారెడ్డి వార్తలు

విద్యుత్​ షాక్​తో కార్మికుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా వెల్డింగ్​ చేయడం వల్ల విద్యుత్​ షాక్​ తగిలిందని.. ఇనుప రేకుకు విద్యుత్​ ప్రవహించి ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

Man Died with Electricity shock in Sangareddy District
విద్యుత్​ షాక్​తో వ్యక్తి మృతి.. కేసు నమోదు

By

Published : Oct 17, 2020, 11:40 AM IST

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పరిధిలోని స్పాన్సుల్​ ఫార్మా లిమిటెడ్​ కంపెనీలో జరిగిన విద్యుత్​ ప్రమాదంలో కార్మికుడు మరణించాడు. రసాయన పరిశ్రమలో సత్యం అనే కాంట్రాక్టర్​ వద్ద గాజుల రామారంకు చెందిన నరసింహాచారి, ఉపేందర్, కృష్ణారెడ్డిలు పని చేస్తున్నారు.

ఇనుప రేకుపై డ్రమ్ములు వేసుకొని వాటిపై ఎక్కి పని చేస్తుండగా.. డ్రమ్ములకు విద్యుత్​ తీగలు తగిలి నరసింహాచారి, కృష్ణారెడ్డి, ఉపేందర్​లకు షాక్ కొట్టింది. ఉపేందర్​ రెడ్డి, కృష్ణారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. నరసింహాచారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా వైద్యులు చనిపోయినట్టు తెలిపారు. గుమ్మడిదల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details