లారీ కింద పడి ద్విచక్రవాహనదారుడు దుర్మరణం - పటాన్చెరులో లారీ కింద పడి వ్యక్తి మృతి
లారీని దాటించబోయి ద్విచక్రవాహనదారుడు దాని కింద పడి దుర్మరణం చెందిన ఘటన... సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వద్ద చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
![లారీ కింద పడి ద్విచక్రవాహనదారుడు దుర్మరణం man died in road accident in patancheru on national highway](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8437475-319-8437475-1597556412622.jpg)
లారీ కింద పడి ద్విచక్రవాహనదారుడు దుర్మరణం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని దాటించబోయి దాని కింద పడి ద్విచక్రవాహనదారుడు దుర్మరణం చెందాడు. కూకట్పల్లికి చెందిన గణపతి పటాన్చెరు నుంచి చందానగర్ వైపు వెళుతుండగా... ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి లారీ వెనుక చక్రం కింద పడింది. గణపతి తలపై నుంచి లారీ వెళ్లడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టమార్టానికి పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.