తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బతుకమ్మ వేడుకల ఏర్పాట్లలో విషాదం.. కరెంట్​ షాక్​తో వ్యక్తి మృతి - gopalpalli dead news

బతుకమ్మ వేడుకల కోసం విద్యుత్​ దీపాలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

man died due to current shock at gopalpalli in sirscilla
బతుకమ్మ వేడుకల ఏర్పాట్లలో విషాదం.. కరెంట్​ షాక్​తో వ్యక్తి మృతి

By

Published : Oct 23, 2020, 5:33 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గోపాల్​పల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో బతుకమ్మ వేడుకల కోసం విద్యుత్​ దీపాలు ఏర్పాటు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై గ్రామ పంచాయతీ ట్రాక్టర్​ డ్రైవర్​ భూక్య రాజు అనే వ్యక్తి మృతి చెందాడు.

స్థానికులు వెంటనే రాజును మండల కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రాజు మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి..బైక్​ను ఢీకొట్టిన ఇసుకట్రాక్టర్​... ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details