ఏపీలోని కడప జిల్లా రాయచోటిలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. రాజుల కాలనీకి చెందిన యూసఫ్ కొలిమిమిట్టకు చెందిన ఓ వివాహితతో మూడేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. గతంలో ఈ విషయంపై ఆ మహిళ భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వీరిరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ ఘటనతో మార్పు కలగని యూసఫ్ మళ్లీ ఆ మహిళకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు.
వివాహేతర సంబంధం... తీసింది ప్రాణం - రాయచోటిలో వ్యక్తి దారుణ హత్య
మూడేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిన వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ప్రియురాలి ఇంటికి వచ్చిన ప్రియుడిని భర్తతో కలిసి దారుణంగా హతమార్చింది ఓ మహిళ. ఈ సంఘటన కడప జిల్లా రాయచోటిలో జరిగింది.
![వివాహేతర సంబంధం... తీసింది ప్రాణం man-brutally-murdered-in-rayachoti-kadapa-district in ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9756033-410-9756033-1607020503415.jpg)
వివాహేతర సంబంధం... తీసింది ప్రాణం
ఈ క్రమంలో గురువారం రాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లిన యూసఫ్ను.. మహిళ, ఆమె భర్త మౌలాలి కలిసి దారుణంగా తలపై కొట్టారు. ఈ ఘటనలో యూసఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... హత్యకు పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:కరోనా వ్యాక్సిన్ పేరుతో సైబర్ మోసానికి స్కెచ్.. హెచ్చరించిన ఇంటర్పోల్
Last Updated : Dec 4, 2020, 7:42 AM IST