కరోనా వ్యాప్తి నివారణలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులపై గతంలో విమర్శలు చేసిన వారు ఇప్పుడు అభినందిస్తున్నారు. కానీ కొందరు అధికారులు మాత్రం ఆ శాఖకు అప్రతిష్ఠ తీసుకొస్తున్నారు.
మద్నూర్ కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు - Madnoor constable took bribe
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో పోలీసు యంత్రాంగం అలుపెరగకుండా శ్రమిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. మరో పక్క ఆ శాఖలోనే కొందరు అక్రమార్కులు మామూళ్లకు అలవాటుపడి శాఖకు అప్రతిష్ఠ తీసుకొస్తున్నారు.
![మద్నూర్ కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు madnoor constable suspended due to taking bribe](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6935483-442-6935483-1587805329180.jpg)
మద్నూర్ కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు
కామారెడ్డి జిల్లా మద్నూర్ ఠాణాలో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్ అక్రమంగా ఇసుక రవాణా చేసే వ్యక్తితో తనకు ఇవ్వాల్సిన డబ్బులు కూరగాయలు దుకాణంలో ఇవ్వాలని సాగిస్తున్న సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ సంఘటనపై పోలీసు శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. పూర్తి విచారణ చేసి సదరు కానిస్టేబుల్ ప్రేమ్ సింగ్పై సస్పెన్షన్ వేటు వేసినట్లు జిల్లా ఎస్పీ శ్వేత తెలిపారు.