తెలంగాణ

telangana

వెనుక నుంచి ఢీకొన్న లారీ... ఇద్దరు మహిళలు దుర్మరణం

By

Published : Dec 10, 2020, 7:02 PM IST

ద్విచక్రవాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మెదక్​ జిల్లా మనోహరాబాద్​ మండలం జీడిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘటన జరిగింది.

Breaking News

మెదక్​ జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహలను పోస్టుమార్టం కోసం తూప్రాన్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:మావోయిస్టు దళ సభ్యుడు అరెస్ట్.. పేలుడు పదార్థాలు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details