మెదక్ జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహలను పోస్టుమార్టం కోసం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.