తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ.. ఒకరి మృతి

ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది.

By

Published : May 8, 2020, 9:23 AM IST

lorry accident at indalwai in nizamabad district
ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ.. ఒకరి మృతి

నిజామాబాద్ జిల్లా ఇందల్​వాయి మండలం దేవితండా వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుంచి నాగ్​పూర్ వైపు వెళ్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఘటనలో ఆగి ఉన్న లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

వలస కూలీలతో హైదరాబాద్ నుంచి ఛత్తీస్​గఢ్​ వెళ్తున్న లారీ.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మధ్యప్రదేశ్​కు చెందిన లారీ డ్రైవర్ మృతి చెందాడు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ.. ఒకరి మృతి

ఇదీచూడండి: తండ్రి అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details