తెలంగాణ

telangana

By

Published : Aug 1, 2020, 8:57 PM IST

ETV Bharat / jagte-raho

లైవ్​ వీడియో: ఆర్​ అండ్ ​బీ అధికారులు రాసిన మరణ శాసనం

పైప్​లైన్​ లీకేజీ అరికట్టేందుకు రోడ్డును తవ్వి వదిలేశారు ఆర్ అండ్​ బీ అధికారులు. రోడ్డును మరమ్మతు చేయకుండా అలాగే వదిలేశారు. ఇదే ఆ యువకుల పాలిట శాపంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పడిన గుంత... ఓ యువకుడి నిండుప్రాణాన్ని బలి తీయగా.. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

accident
accident

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని టెక్కే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పట్టణంలో హౌసింగ్​ బోర్డు కాలనీకి చెందిన 15 ఏళ్ల శ్రీహర్ష, శిల్పానగర్​కు చెందిన రాజుగౌడ్​ అనే యువకులు ద్విచక్రవాహనంపై వెళ్తూ.. గుంత వల్ల అదుపు తప్పి లారీ కిందకు దూసుకెళ్లారు. ఈ ఘటనలో శ్రీహర్ష ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

లైవ్​ వీడియో: ఆర్​అండ్​బీ అధికారులు రాసిన మరణ శాసనం

గుంత ఎందుకు ఏర్పడింది..?

ఈ ప్రాంతంలో ఆర్​ అండ్​ బీ రహదారి కింద నీటి పైప్​లైన్​ ఉంది. పైపు లీకవ్వడం వల్ల పురపాలక శాఖ సిబ్బంది మరమ్మతు చేశారు. అనంతరం తవ్విన రహదారిని అలాగే వదిలేశారు.

ABOUT THE AUTHOR

...view details