తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇంటిపై పిడుగు... సమీపంలోని రెండు గేదెలు మృతి - గుండ్లపల్లిలోని ఓ ఇంటిపై పిడుగు

గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటిపై పిడుగు పడింది. ఆ సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణపాయం తప్పింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Thunder
ఇంటిపై పిడుగు... సమీపంలోని రెండు గేదెలు మృతి

By

Published : Sep 14, 2020, 3:37 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామంలో గత రెండురోజుల నుంచి కురుస్తోన్న వర్షాలకు ఓ ఇంటిపై పిడుగు పడింది. దీనితో ఇంటిపైన ఉన్న రేకులు పగిలిపోయాయి. పక్కన ఉన్న రెండు గేదెలు మృతి చెందాయి. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.

పక్కన ఉన్న రెండు గేదెలు మృతి చెందడం వల్ల వాటి యజమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి:పిడుగు పడి వ్యక్తి మృతి..స్పృహ కోల్పోయిన 12 మంది రైతులు

ABOUT THE AUTHOR

...view details