యాదాద్రి భువనవగిరి జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన గీతకార్మికుడు బందారపు భిక్షపతి... ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందాడు. అతనికి భార్య, నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పిల్లలందరికి పెళ్లిళ్లు కాగా.. ఓ ప్రమాదంలో కొడుకు, కోడలు చనిపోయారు. వారి పిల్లల ఆలనాపాలన తాత భిక్షపతే చూస్తుకునేవాడు.
తాటి చెట్టుపై నుంచి జారిపడి గీతకార్మికుడు మృతి - geetha karmikulu died in dasireddygudem village
కల్లు గీతకార్మికులకు చెట్లే ఉపాధి. అలాంటి ఓ గీతకార్మికుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన వలిగొండ మండలం దాసిరెడ్డి గూడెం గ్రామంలో చోటుచేసుకుంది.

తాటి చెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు మృతి
పిల్లలకు పెద్దదిక్కుగా ఉన్న భిక్షపతి మృతితో పిల్లలు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు, బంధువులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసున్నారు.
ఇదీ చూడండి: తల్లి కాదు రాక్షసి.. ప్రియుడి కోసం పిల్లల్ని చంపింది'