తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

యశోద గ్రూపు ఆసుపత్రులపై ఆదాయపన్నుశాఖ దాడులు

By

Published : Dec 22, 2020, 11:13 AM IST

Updated : Dec 22, 2020, 3:40 PM IST

it-rides-on-yashoda-hospital-and-doctors-in-hyderabad
యశోద ఆస్పత్రుల్లో ఆదాయ పన్ను అధికారుల తనిఖీలు

11:11 December 22

యశోద గ్రూపు ఆసుపత్రులపై ఆదాయపన్నుశాఖ దాడులు

హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో యశోద గ్రూపు ఆసుపత్రులపై ఆదాయపన్నుశాఖ దాడులు చేస్తోంది. ఆదాయపన్ను చెల్లింపుల్లో వ్యత్యాసం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి సోదాలు చేస్తున్నట్లు ఐటీశాఖ అధికారులు తెలిపారు. మొత్తం 20కి పైగా బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. యశోద గ్రూపు కార్యాలయాలతోపాటు ఆసుపత్రులకు సంబంధించిన వైద్యుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.  

ఉదయం నుంచి ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. కోల్‌కతాకు చెందిన ఓ ఆహార ఉత్పత్తి సంస్థపై కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు బృందాలు ఈ ఆహార సంస్థ కార్యాలయాలల్లో సోదాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:మాజీ ఎంపీ రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు

Last Updated : Dec 22, 2020, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details