సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అంతర్రాష్ట్ర దొంగను కోదాడ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా కోదాడ డీఎస్పీ రఘు వివరాలను వెల్లడించారు.
కొద్ది రోజులుగా కోదాడ పట్టణంలోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న విజయవాడకు చెందిన కొర్రపాటి వీర నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 7 తులాల బంగారు ఆభరణాలు, 56 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.