తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసు నిందితులకు జైలు శిక్ష - డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసు నిందితులకు జైలు శిక్ష

మందు తాగి వాహనాలు నడిపిన వారి మత్తు వదిలిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 19 మందికి న్యాయస్థానాలు జైలు శిక్షలు విధించాయి. మొత్తం 207 కేసులు విచారించిన కోర్టులు నిందితులకు రూ.8.94లక్షల జరిమానా విధించాయి.

prison for drunk and drive cases
డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసు నిందితులకు జైలు శిక్ష

By

Published : Jan 12, 2021, 10:40 PM IST

హైదరాబాద్​ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 19 మందికి న్యాయస్థానాలు జైలు శిక్షలు విధించాయి. మొత్తం 207 కేసులు విచారించిన కోర్టులు నిందితులకు రూ.8.94లక్షల జరిమానా విధించాయి.

మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, అల్వాల్, జీడిమెట్ల, మియాపూర్, రాజేంద్రనగర్, షాద్​నగర్​లో డ్రంక్ అండ్ డ్రైవ్​లో పట్టుబడిన వారి లైసెన్సులు రద్దు చేసేందుకు ఆర్టీఓ అధికారులు లేఖ రాశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల్లో ఇతర వాహనదారుల మృతికి కారణమైన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కాగితాలపైనే వ్యాపారాలు.. అక్రమార్కుల జేబుల్లోకి కోట్ల రూపాయలు

ABOUT THE AUTHOR

...view details