తెలంగాణ

telangana

By

Published : Oct 6, 2020, 6:07 PM IST

ETV Bharat / jagte-raho

అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం

నాగర్​ కర్నూల్​లో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సోమవారం రాత్రి పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న పోలీసులకు పక్కా సమాచారం రావడం వల్ల నిఘా వేశారు. బొలెరో వాహనంలో కల్వకుర్తి వైపు తరలిస్తుండగా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాధవ రెడ్డి తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనంఅక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కల్వకుర్తి వైపు తరలిస్తున్నారు. ఈ విషయంపై సమాచారం రావడం వల్ల పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు.

బియ్యంతో పాటు వాహనాన్ని పోలీస్ స్టేషన్​కు తరలించి సీజ్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాధవ రెడ్డి వెల్లడించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:అక్రమంగా రవాణా చేస్తున్న 105 క్వింటాళ్ల రేషన్​బియ్యం స్వాధీనం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details