తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రూ.1.5 లక్షల విలువైన మద్యం సీజ్​ - illegal liquor sized

లాక్​డౌన్​ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిని పంజాగుట్ట పోలీసులు పట్టుకున్నారు. రూ.1.5 లక్షల విలువైన మద్యం సీసాలను సీజ్​ చేశారు. బేగంపేటలోని టెన్ డౌనింగ్​ పబ్​లో కేంద్రంగా మద్యం అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసుల దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తిని అరెస్ట్​ చేశారు.

illegal liquor sized in panjagutta ten downing street
రూ.1.5 లక్షల విలువైన మద్యం సీజ్​

By

Published : Apr 24, 2020, 10:01 PM IST

Updated : Apr 25, 2020, 2:49 AM IST

లాక్​డౌన్​ను ఉల్లంఘించి అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారనే సమాచారంతో... బేగంపేటలోని ఓ పబ్ కిచెన్​పై పంజాగుట్ట పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.1.50 లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. టెన్​డౌనింగ్​ స్ట్రీట్​ ​పబ్​ కేంద్రంగా కిచెన్​ మేనేజర్​ రాంబాబు.. సెక్యూరిటీ గార్డ్​ సాయంతో మద్యాన్ని అక్రమంగా విక్రయించేవాడు.

కిచెన్ నుంచి పబ్ లోపలికి వెళ్ళడానికి దారి ఉంది... పబ్​లో మద్యం తీసుకువచ్చి కిచెన్ పక్కనే ఉన్న గదిలో ఉంచేవాడు. మద్యం కావాల్సిన వారు అక్కడికే వచ్చి తీసుకునేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు.

35 కేసుల బీర్​ బాటిళ్లు, 14 బ్రీజర్లతో పాటు.. పలు రకాల మందు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కిచెన్‌ మేనేజర్‌పై కేసు నమోదు చేసి.. సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు.

రూ.1.5 లక్షల విలువైన మద్యం సీజ్​

ఇదీ చూడండి:నెలవంక దర్శనం..రేపటి నుంచే రంజాన్ మాసం

Last Updated : Apr 25, 2020, 2:49 AM IST

ABOUT THE AUTHOR

...view details