సిద్దిపేట జిల్లా జగదేవపూర్కు చెందిన స్వామి, చంద్రశేఖర్, మహిపాల్.. ముగ్గురూ జల్సాలకు అలవాటుపడి.. సంపాదన సరిపోక.. గంజాయి వ్యాపారం మొదలుపెట్టారు. జగదేవపూర్ గ్రామశివారులో ఉన్న వైన్షాప్ వద్ద గంజాయి ప్యాకెట్లను తీసుకొచ్చి అమ్మతున్నారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం రాగా.. ఎస్సై పరమేశ్వర్గౌడ్, సిబ్బందితో కలిసి సోదాలు చేశారు.
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్.. పరారీలో మరో వ్యక్తి - two arrested in illegal ganja trading in siddipe
గంజాయి వ్యాపారం చేస్తున్న ఇద్దరు నిందితులను సిద్దిపేట జిల్లా జగదేవపూర్ పోలీసులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని.. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్.. పరారీలో మరో వ్యక్తి
ప్లాస్టిక్ డబ్బాలో దాచి ఉంచిన 58 గంజాయి ప్యాకెట్లు, చంద్రశేఖర్ వద్ద 2 ప్యాకెట్లు.. మొత్తం 60 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి:పీవీకి భారతరత్న తీర్మానం సమయంలో సభలో స్వల్ప సంవాదం