తెలంగాణ

telangana

'నూతన్​ నాయుడు నుంచి నాకు ప్రాణహాని ఉంది... రక్షించండి'

నూతన్​నాయుడుతో తనకు ప్రాణహాని ఉందని ఏపీలోని విశాఖ శిరోముండనం బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనలో పాల్గొన్న ప్రతిఒక్కరినీ శిక్షించాలని ఎస్సీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

By

Published : Aug 31, 2020, 11:15 AM IST

Published : Aug 31, 2020, 11:15 AM IST

i-am-in-danger-of-death-with-nutan-naidu-says-tonsure-victim
'నూతన్​ నాయుడు నుంచి నాకు ప్రాణహాని ఉంది... రక్షించండి'

తన పూర్వపు యజమాని నూతన్​నాయుడు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఏపీలోని విశాఖకు చెందిన శిరోముండనం బాధితుడు భయాందోళన వ్యక్తం చేశాడు. తనకు రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించాడు. తెదేపా నేతలు బాధితుడిని పరామర్శించారు. ఈ ఘాతుకానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

శిరోముండనం ఘటనలో ఉన్న ప్రతిఒక్కరినీ శిక్షించాలని తెదేపా ఎస్సీ సెల్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన ఇంటి యజమాని నూతన్​నాయుడుని అరెస్ట్ చేయాలని కోరారు. లక్ష రూపాయల చెక్, రూ.50 వేల నగదు, ఔట్​సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చి... ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు.

'నూతన్​ నాయుడు నుంచి నాకు ప్రాణహాని ఉంది... రక్షించండి'

ఇదీ చదవండీ...కనీస రిటర్ను హామీ పింఛను పథకానికి కసరత్తు

ABOUT THE AUTHOR

...view details