తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2020, 9:47 PM IST

ETV Bharat / jagte-raho

ఘరానా మోసగాడి అరెస్టు.. రిమాండ్​కు తరలింపు

ఆన్​లైన్​ మోసాలకు పాల్పడుతూ... పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ ఘరానా మోసగాడిని సైబర్​ క్రైమ్​ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే పలు స్టేషన్​లలో నిందితుడిపై కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.

hyderabad cyber crime police arrest online cheater
ఘరానా మోసగాడి అరెస్టు.. రిమాండ్​కు తరలింపు

మాయ మాటలు చెప్పి ఆన్​లైన్​లో డబ్బులు దండుకుంటూ... పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఓ ఘరానా మోసగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తూర్పు గోదావరికి చెందిన దూల నాగేశ్వరరావు... శంషాబాద్ విమానాశ్రయంలో బస్సులు, కార్గో, గూడ్స్ లారీలను లీజుకు ఇప్పిస్తానని లారీ వెనుక భాగంలో ఉన్న ఫోన్ నెంబర్లతో యజమానులకు ఫోన్ చేసి నమ్మబలుకుతూ పలువురిన మోసం చేశాడు.

ఇదే తరహాలో అఫ్జల్​గంజ్​కు చెందిన గోవింద రాజ్​తో అగ్రిమెంట్, సెక్యురిటి పేరుతో రూ. 92వేలు ఖాతాలో జమ చేయించుకున్నాడు. అనంతరం మీ లీజుకు అనుమతులు వచ్చాయని... వాహనాలు తీసుకొని ఎయిర్​పోర్టుకు రమ్మని గోవింద రాజ్​కు చెప్పాడు. అక్కడి వెళ్లి ఎన్నిసార్లు కాల్​ చేసినా... స్విచ్ఛాఫ్​ వచ్చింది. మోసపోయినని గ్రహించి... సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగేశ్వరరావుపై సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్​తో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్​ పరిధిలో అనేక కేసులు ఉన్నాయని, విచారణ సమయంలో మూత్రం వస్తుందని నానా హాగమా చేసి తప్పించుకుంటాడని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details