తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఓఎల్​ఎక్స్​లో మోసాలు.. తొమ్మిదిమంది అరెస్టు - ఓఎల్​ఎక్స్​లో మోసాల ముఠా అరెస్టు

ఓఎల్​ఎక్స్​లో వాహనాల ఫొటోలు పెట్టి తక్కువ ధరకు అమ్ముతామంటూ... మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్​కు చెందిన ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

ఓఎల్​ఎక్స్​లో మోసాలు.. నిందితుల అరెస్టు
ఓఎల్​ఎక్స్​లో మోసాలు.. నిందితుల అరెస్టు

By

Published : Oct 10, 2020, 2:29 PM IST

కొంత కాలంగా ఓఎల్ఎక్స్ లో వాహనాల నకిలీ ఫొటోలు పెడుతూ... మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ రాష్ట్రం భరత్​పూర్​కు చెందిన 9 మంది నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన ఎనిమిది మందిని వీరు మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు.

టూ వీలర్, ఫోర్ వీలర్, ఫొటో కెమెరాలు... తక్కువ ధరలకు అమ్ముతామంటూ పోస్టు ఉంచుతారు. బుక్​ చేసుకున్నవారి నుంచి డబ్బులు బదిలీ చేయించుకుంటారు. ఆ తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడం, వస్తువులు రాకపోవడం వల్ల మోసపోయామని బాధితులు గ్రహంచి, సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్టు సీసీఎస్​ పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:యూఎస్ కంపెనీ పేరుతో గాలం.. రూ.52 లక్షల మోసం

ABOUT THE AUTHOR

...view details