తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య

మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ భార్య భర్తను చంపిన ఘటన మేడ్చల్​ జిల్లా నాగారంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

By

Published : Jan 3, 2021, 3:54 PM IST

husband murdered by his wife in medchal district
వేధిస్తున్నాడని భర్తను హతమార్చిన భార్య

మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని బాపూజీనగర్​లో శ్యామ్​, సరోజ దంపతులు నివసిస్తున్నారు. శ్యామ్​ స్థానికంగా వాచ్​మెన్​గా పని చేస్తున్నారు. మద్యానికి బానిసైన అతను రోజూ తాగొచ్చి భార్యను హింసిస్తుండే వాడు.

శనివారం రాత్రి తాగొచ్చిన శ్యామ్​.. భార్య సరోజతో గొడవ పడ్డారు. సరోజ ఆవేశంతో భర్తపై రోకలి బండతో దాడి చేసింది. శ్యామ్​ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details