తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భారీ స్థాయిలో నిషేధిత గుట్కా బస్తాలు స్వాధీనం - సంగారెడ్డి జిల్లా నేేర సమాచారం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్​పల్లి ఎక్సైజ్​ చెక్​పోస్ట్​ వద్ద భారీస్థాయిలో గుట్కా పట్టుబడింది. మినీ ట్రక్కులో తరలిస్తున్న ఇద్దరు వక్తులను అదుపులోకి తీసుకుని 13 లక్షల విలువైన 80 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.

Huge amount of banned gutkha seized excise check post in sangareddy dist
భారీ స్థాయిలో నిషేధిత గుట్కా బస్తాలు స్వాధీనం

By

Published : Nov 27, 2020, 4:14 PM IST

కర్ణాటక నుంచి హైదరాబాద్​కు తరలిస్తున్న నిషేధిత గుట్కా పాకెట్లను ఎక్సైజ్​ పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్​పల్లి తనిఖీ కేంద్రం వద్ద సోదాలు చేస్తుండగా 13 లక్షల విలువైన గుట్కా పట్టుబడింది.

మినీ ట్రక్కులో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 80 గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. బీదర్​ నుంచి హైదరాబాద్​కు తీసుకెళ్తున్నట్లు ఎక్సైజ్​ పోలీసులు గుర్తించారు. పట్టుబడిన గుట్కా బస్తాలు, ట్రక్కును చిరాగ్​పల్లి పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి:ఖమ్మం జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ...

ABOUT THE AUTHOR

...view details