ఫోర్జరీ పత్రాలతో ఇంటి స్థలాన్ని కబ్జా చేసిన ఓ వ్యక్తిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కార్మికనగర్కు చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తికి చెందిన 224 గజాల ఇంటి స్థలాన్ని బాలప్రకాష్ అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకి ఫిర్యాదు చేశాడు.
నకిలీ పత్రాలతో ఇంటి కబ్జా.. రిమాండ్కు నిందితుడు - ఇంటి కబ్జా కేసులు
ఫోర్జరీ పత్రాలతో నగరంలోని ఓ ఇంటి స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని రిమాండ్కు తరలించారు.
నకిలీ పత్రాలతో ఇంటి కబ్జా.. రిమాండ్కు నిందితుడు
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో నిందితుడు బాలప్రకాష్ తప్పుడు పత్రాలను సృష్టించాడని తేలడంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి:ఎవరూ లేని వారి కోసం ఆ నలుగురిగా మారింది!!