తెలంగాణ

telangana

By

Published : Dec 11, 2020, 7:04 PM IST

ETV Bharat / jagte-raho

వాడరేవులో ఉద్రిక్తత.. కర్రలు, కత్తులతో పరస్పర దాడులు

చేపలు పట్టే విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది. వేటపాలెం మండలానికి చెందిన మత్య్సకారులు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా... మరో 15 మందిని చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

high tension at chirala vodarevu in prakasam district of ap
వాడరేవులో ఉద్రిక్తత..

ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సముద్రంలో చేపలు పట్టే విషయంలో వేటపాలెం మండలంలోని కటారివారిపాలెం, రామాపురం మత్య్సకారులు.. వాడరేవు మత్స్యకారుల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో కటారివారిపాలెం, రామాపురం మత్స్యకారులు ఒక్కసారిగా వందల సంఖ్యలో వచ్చి... వాడరేవు మత్స్యకారులపై దాడికి దిగారు. కర్రలు, కత్తులతో విచక్షణారహితంగా దాడులు చేశారు.

ఈ ఘటనలో గాయపడిన 15 మందిని చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జాలర్లను చెదరగొట్టారు.

ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదం... మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో తల ఇరుక్కుపోయి...

ABOUT THE AUTHOR

...view details