తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నిలిపి ఉంచిన కారులో భారీగా గంజాయి.. పట్టుకున్న పోలీసులు - భద్రాచలంలో గంజాయిని పట్టుకున్న పోలీసులు

భద్రాచలంలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 219 కిలోల గంజాయి, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Heavy marijuana in parked car at badrachalam
నిలిపి ఉంచిన కారులో భారీగా గంజాయి.. పట్టుకున్న పోలీసులు

By

Published : Jul 11, 2020, 7:17 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గోదావరి కరకట్ట సమీపంలో పెట్రోలింగ్​ నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన కారును తనిఖీ చేశారు. అందులో 219 కిలోల గంజాయిని గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.33 లక్షల వరకు ఉంటుందని సీఐ వినోద్​రెడ్డి పేర్కొన్నారు. కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సులభంగా నగదు సంపాదించవచ్చని చాలా మంది యువకులు ఈ అక్రమ దారిని ఎన్నుకుంటున్నారని సీఐ వినోద్​రెడ్డి పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు భద్రాచలంలోని అన్ని ప్రధాన రహదారుల్లో పగలు, రాత్రి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇదీచూడండి: భాగ్యనగరంలో బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు

ABOUT THE AUTHOR

...view details