తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పిల్లల బొమ్మల్లోనూ బంగారం స్మగ్లింగ్

విదేశాల నుంచి అక్రమంగా బంగారం తెచ్చేందుకు మోసగాళ్లు రోజుకో అవతారమెత్తుతున్నారు. అక్రమాలకు ఎన్ని ఎత్తులు వేసినా కస్టమ్స్​ అధికారుల తనిఖీల్లో చిత్తవుతున్నాయి. చివరికి అడ్డంగా దొరికిపోయి జైలుపాలవుతున్నారు.

By

Published : Mar 24, 2019, 5:44 PM IST

ఇలా కూడా దోచేస్తారా..!

ఇలా కూడా దోచేస్తారా..!
శంషాబాద్​ విమానాశ్రయంలో 700 గ్రాముల బంగారం పట్టుబడింది. ఆదివారం వేరు వేరు విమానాల్లో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులను పక్కా సమాచారంతో అధికారులు తనిఖీ చేశారు. పిల్లలు ఆడుకునే బొమ్మలో బంగారం పెట్టి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వాటిని తెరచి చూడగా ఒకరి నుంచి 349 గ్రాములు, మరో వ్యక్తి వద్ద 375 గ్రాముల బంగారం దొరికినట్లు కస్టమ్స్ ఎయిర్ పోర్టు డిప్యూటీ కమిషనర్ రవి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details