తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి - కామారెడ్డి జిల్లాలో దారుణం

కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం సరిగాలేని ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

kamareddy district latest news
kamareddy district latest news

By

Published : May 20, 2020, 12:31 PM IST

కామారెడ్డి రామారెడ్డి మండలం మునిప్ప తండా శివారులో దారుణం చోటు చేసుకుంది. ముదావత్ జందర్ ముదావత్ మంగ్లీల కూతురు సంధ్య (10) అనే బాలిక అనుమానాస్పద మృతి చెందింది. ఈ ఘటన గ్రామానికి కిలోమీటర్ దూరంలో జరిగింది. బాలికకు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈనెల 17న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన బాలిక... శవమై తేలడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details