తెలంగాణ

telangana

శిశువు విక్రయం కలకలం.. రంగంలోకి పోలీసులు

By

Published : Sep 23, 2020, 5:07 PM IST

ఆడశిశువులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కొందరు వ్యక్తులు మారడం లేదు. తాజాగా భువనగిరిలో ఆడ శిశువును విక్రయించిన ఘటన కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

girl baby selling at bhuvanagiri police investigation
శిశువు విక్రయం కలకలం.. రంగంలోకి పోలీసులు

యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆడ శిశువును విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. భువనగిరి ఆస్పత్రిలో ఈనెల 12న ఓ యువతి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈనెల 14న రూ.60 వేలకు యువతి తల్లి విక్రయించింది.

ఘట్‌కేసర్‌కు చెందిన పిల్లలు లేని దంపతులు ఆ శిశువును కొనుగోలు చేశారు. యాదాద్రి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దంపతుల నుంచి ఆడ శిశువును స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి :'ఉపాధి హామీ పనుల కోసం ఫోన్​ చేయండి'

ABOUT THE AUTHOR

...view details