తెలంగాణ

telangana

28 కిలోల గంజాయి స్వాధీనం: ఇద్దరు అరెస్ట్​

By

Published : Apr 25, 2019, 11:14 PM IST

రాజస్థాన్​కు అక్రమంగా తరలిస్తున్న 28 కిలోల గంజాయిని  కాజీపేట రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్​కు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్​ చేశారు.

28 కిలోల గంజాయి స్వాధీనం

అనకాపల్లి నుంచి రాజస్థాన్​కు అక్రమంగా తరలిస్తున్న 28 కిలోల గంజాయిని కాజీపేట్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్​కి చెందిన సన్వర్ లాల్, బిలాల్ అనే ఇద్దరు యువకులు ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు కోణార్క్ ఎక్స్​ప్రెస్​ నుంచి గంజాయి బ్యాగులతో దిగిన యువకులు రాజస్థాన్ వెళ్లడానికి మరో రైలు కోసం ప్లాట్ ఫామ్​పై వేచి ఉండాగా పోలీసులు వారిని తనిఖీ చేశారు. 14 కట్టల్లో 28 కిలోల గంజాయి దొరికినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల న్యాయస్థానంలో హాజరుపరిచారు.

28 కిలోల గంజాయి స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details