హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణను అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. స్టేషన్లోని కేసు నెంబర్ 240/20లో నిందితుడిగా ఉన్న ఎం. సంతోష్రెడ్డి.. నకిలీ సర్టిఫికేట్ తయారు చేస్తూ ఇటీవల జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు.
లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడిన గాంధీనగర్ ఎస్సై - గాంధీనగర్లో ఏసీబీ తనిఖీలు
కేసు విచారణ నిమిత్తం డిమాండ్ చేసిన రూ. 30 వేల నగదును ఎస్సై తీసుకుంటుండగా.. హైదరాబాద్ అనిశా అధికారులు పట్టుకున్న ఘటన హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడిన గాంధీనగర్ ఎస్సై
కేసు విచారణ నిమిత్తం సాయం చేసేందుకు ఎస్సై లక్ష్మీనారాయణ రూ. 30 వేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిందితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా వ్యూహంతో డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఎస్సై లక్ష్మీనారాయణతో పాటు అతనికి సహాయపడిన కానిస్టేబుల్ నరేష్ను అనిశా అధికారులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండిఃపోలీసు స్టేషన్ నుంచి పరారైన దొంగ