సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. వీరి ఉచ్చులో చిక్కుకుని, డబ్బులు పోగొట్టుకుంటున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ఓ మహిళకు ఓటీపీ పంపంచి.. ఖాతా నుంచి రూ.5 లక్షలు స్వాహా చేశారు కేటుగాళ్లు. ఓఎల్ఎక్స్ పేరుతో మరో వ్యక్తి వద్ద రూ.3.70 లక్షలు కాజేశారు.
ఓటీపీ, ఓఎల్ఎక్స్ పేరుతో వల.. రూ.8.70 లక్షలు స్వాహా - హైదరాబాద్లో సైబర్ మోసం వార్తలు
సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటూ దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓటీపీ, ఓఎల్ఎక్స్ పేరుతో ఇద్దరిని బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. రూ.8.70 లక్షలు కాజేశారు.
ఓటీపీ, ఓఎల్ఎక్స్ పేరుతో వల.. రూ.8.70 లక్షలు స్వాహా
మోసపోయినట్లు గుర్తించిన బాధితులు సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.